Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బాలనాగిరెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన వైసీపీ కార్యకర్తలు

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బుధవారం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామ పురవీదుల గుండా జై జగన్, జై బాలనాగిరెడ్డి అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తరలి వెళ్లారు. ఇందులో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి,సచివాలయ జేఏసీ కన్వీనర్ రవి చంద్రారెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, నాయకులు జాము మూకన్న, ముక్కరన్న, అర్లప్ప వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపిటిసిలు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img