ఆళ్లగడ్డలో నెలకొన్న హై టెన్షన్
ఆళ్లగడ్డ లో ఉండడానికి వీలులేదు…మాజీ మంత్రి
ఏ జరిగినా ఇక్కడే ఉంటా… ఏవీ సుబ్బారెడ్డి
విశాలాంధ్ర , మిడుతూరు( నంద్యాల ):రాష్ట్ర రాజకీయాలలో ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ కు అడ్డా బాంబుల గడ్డగా పేరుంది. అలాంటి ఆళ్లగడ్డలో రెండు రోజులుగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవి ,భూమా వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది .ఎన్నికల సమయంలో ఇరువురు నేతల అనుచరుల మధ్య భారీగా గొడవలు జరిగాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరియు ఏవి సుబ్బారెడ్డి ల మధ్య రాజకీయ వివాదం మళ్లీ మొదలైంది.ఆళ్లగడ్డలో ఉండడానికి వీలు లేదని, నియోజకవర్గం వదలి వెళ్లిపోవాలని ఏవి సుబ్బారెడ్డికి ..మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. నా స్వగృహంలో ఉంటానని, ఏం జరిగిన నేను ఇక్కడనే ఉంటానని ఏవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారులు తీస్తాయనే నేపథ్యం లో పోలీసులు భారీగా మోహరించి వారి కుటుంబాల ఇంటిదగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు . దీంతో పట్టణంలోని వ్యాపార , వస్త్రాలు మరియు దుకాణం యజమానులు ఇరువర్గాల మధ్య ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయోనని దుకాణాలు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఈ ఇద్దరి నేతల మధ్య గతంలో మాటల దాడులు జరిగాయి . ఎన్నికల శంఖారావం లో ఏవిని వేదిక ఎక్కనివ్వనని ఏవి సుబ్బారెడ్డి పై భూమా అఖిలప్రియ చేసిన ఘాటైన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.! ఆళ్లగడ్డలో టిడిపి అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు సైకిల్ యాత్ర చేపట్టిన ఏ వి సుబ్బారెడ్డి పై రాళ్ల వర్షం కురిపించిన సంఘటనలు నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆయన సమక్షంలోనే ఏవి ,భూమ వర్గాల మధ్య గొడవలు జరగడంతో పార్టీ అధిష్టానం సీరియస్ తీసుకుని ఇరువర్గాల పై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ మందలించింది. ఆళ్లగడ్డ పరిణామాల పై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.