: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం పెద్దసంఖ్యలో ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా క్లిష్ట సమయంలో లక్షలాది కుటుంబాలకు ఉచిత రేషన్ ఆసరాగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీఎంజీకేఏవై లబ్ధిదారులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సరైన పంపిణీ విధానం లేకపోవడం వల్లే గోడౌన్లలో ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతున్నాగాని.. ఆకలి, పోషకాహారలోపం ఆ స్థాయిలో తగ్గడం లేదని అన్నారు.