కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాకిచ్చింది. అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల గుర్తింపును వెల్లడిస్తూ రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్ తమ విధానానికి విరుద్దమని ట్విటర్ పేర్కొంది. రాహుల్పై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను, పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఢల్లీి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా ట్విటర్ తన వాదనను వినిపించింది.దిల్లీలో ఇటీవల ఓ తొమ్మిదేళ్ళ బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కేసు నమోదైంది. బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ గత బుధవారం పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.