గర్భిణీలకు పౌష్టికాహార లోపం లేకుండా చూసేందుకు ఉద్దేశించిన ‘లడ్డూ వితరణ్ యోజన’ను గాంధీనగర్లో అమిత్షా సోమవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ నగర్ ఎంపీగా నియోజకవర్గంలోని తల్లీపిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. చిన్నారులు, గర్భిణులు పూర్తి ఆరోగ్యంతో ఉండేంత వరకూ ఏ దేశం కూడా ప్రగతి సాధించలేదని అన్నారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి దేశంలోని పిల్లలు, గర్భిణీ తల్లులు ఎవరూ పోషకాహార లోపంతో ఉండరాదని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించారని చెప్పారు. గాంధీనగర్లోని 7వేల మందికి పైగా గర్భిణీలకు ఇవాళ్టి నుంచి ప్రతి నెలా 15 పోషకాహార లడ్డూలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవ్వడం జరుగుతుందన్నారు.