Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

వనరుల రక్షణకు లడఖ్‌లో ఉద్యమం

డా. సోమ మర్ల

సోనమ్‌ వాంగ్‌చుక్‌ అమీర్‌ ఖాన్‌ చిత్రం త్రీ ఇడియట్స్‌ నుంచి అందరికీ సుపరిచితం. చిత్రం రెండో దశ అమీర్‌ ఖాన్‌ పాత్ర సోనమ్‌ వాంగ్‌చుక్‌ స్ఫూర్తితో రూపొందింది. ఆయన ప్రఖ్యాత విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త, అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల విజేత. లడఖ్‌లో సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేస్తున్న నిరాహార దీక్ష ఆదివారం 18వ రోజుకు చేరుకుంది. 300 మందికి పైగా ప్రజలు బహిరంగ ప్రదేశంలో మైనస్‌ 10డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఆయనకి మద్దతు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో ముందంజలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఉన్నారు. హిమాలయ ప్రాంతంలోని నలుమూలల్లో ఆయన చేపట్టిన ఉద్యమంలో వేలాది మంది ప్రజలు చేరుతున్నారు. పార్లమెంట్‌లో అత్యధిక మెజారిటీతో 2019 ఆగస్టు 5 న జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత ఈ సమస్య తలెత్తింది. లేప్‌ా- లడఖ్‌ జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో భాగంగా ఉండేది. అది కాశ్మీరీలను అత్యంత కలవరపరిచింది. అయితే సుందర దృశ్యాలను కలిగి ఉన్న హిమాలయ ప్రాంతాలలోని ఖనిజాలతో నిండిన భూములను ఆక్రమించాలనే విభజించి పాలించు దుర్మార్గపు ప్రణాళిక గురించి వారికి తెలియదు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, కార్పొరేట్లకు చాలా చౌక ధరలకు భారీ భూములను ఇవ్వడం, బహుళజాతి దిగ్గజాలకు స్వేచ్ఛనివ్వడం. కానీ దేశంలోని కార్పొరేట్‌ మీడియా అటువంటి సమరశీల ఉద్యమాన్ని హైలైట్‌ చేయడం అవసరమని భావించలేదు. ఈ ప్రాంతంలో దాదాపు 3 లక్షల మంది నివసిస్తున్నారు. 30,000 మందికి పైగా ప్రజలు తమ డిమాండ్లను లేవనెత్తడానికి ఫిబ్రవరి 3న గుమిగూడారు, అంటే ఈ ప్రాంతంలోని పది శాతం జనాభా ఒకే చోట గుమిగూడారు.
లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా రూపొందించడం మొదట్లో అభివృద్ధి, స్వయంప్రతిపత్తికి ఒక అడుగుగా కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ ప్రాంతానికి శాసన అధికారాలు, ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆందోళనలు తలెత్తాయి. పూర్తి స్థాయి రాష్ట్రాల మాదిరిగా కాకుండా, కేంద్రపాలిత ప్రాంతాలు భూమి, చట్టాన్ని అమలు చేయడం, పన్ను వసూలు వంటి అంశాలలో పరిమిత అధికారాలను కలిగి ఉంటాయి. కాశ్మీర్‌ లోయ మొత్తం జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంపై ఆధిపత్యం చెలాయించేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే, 2019 ఆగస్టు 5 తర్వాత ఉద్భవించిన వాస్తవ పరిస్థితుల ప్రకారం, జమ్ము ప్రాంతం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన లేప్‌ా – లడఖ్‌ ప్రాంతం సంతృప్తి చెందలేదు. జమ్మూ, కశ్మీర్‌ కూడా అసంతృప్తితో ఉన్నాయి. ఈ ఉద్యమం ఏదైనా రాజకీయ ఆసక్తితో హఠాత్తుగారాలేదు. లడఖ్‌ ప్రజలు 2020 నుంచి రాష్ట్ర హోదాను డిమాండ్‌ చేస్తున్నారు. తమ ప్రాంతంపై ఎక్కువ రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనా నియంత్రణ కోసం స్థానికుల డిమాండ్లతో ఉద్యమం ఊపందుకుంది. లడఖ్‌ రాష్ట్ర హోదా కోసం డిమాండ్‌ స్థానిక పరిపాలనపై మరింత నియంత్రణ కోసం డిమాండ్లతో వచ్చింది. రాష్ట్ర హోదా లడఖ్‌ దాని ప్రత్యేక సామాజిక-ఆర్థిక, పర్యావరణ అవసరాలకు అనుగుణంగా విధానాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుందని తద్వారా స్థిరమైన అభివృద్ధి దాని ఉనికిని కాపాడుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం మొత్తాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్ము కాశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీని కలిగి ఉంటుంది, కానీ లేప్‌ా, లడఖ్‌ రాజకీయ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కును కలిగి ఉండదు.
రాజ్యాంగ ఉల్లంఘన
రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ దేశంలోని గిరిజన జనాభాకు రాజ్యాంగ రక్షణ. తమ హక్కులను పరిరక్షించడానికి, గిరిజనులు స్వయంప్రతిపత్తి ప్రాంతీయ మండలి, స్వయంప్రతిపత్తి జిల్లా కౌన్సిల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇవి గిరిజన ప్రాంతాన్ని పరిపాలించే అధికారం కలిగి ఉంటాయి. తద్వారా బయటి నుంచి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలోని సహజ వనరులను దోపిడీ చేయలేరు. ప్రస్తుతం అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరం, ప్రాంతాలు ఆరవ షెడ్యూల్‌లో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం తన ఎన్నికల మేనిఫెస్టోలో, లేప్‌ా- లడఖ్‌కు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ను మంజూరు చేస్తామని బీజేపీి స్వయంగా చెప్పింది. హోంమంత్రి కూడా ఈ హామీని చాలాసార్లు చేశారు. అయితే ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు బీజేపీ ఎందుకు సిద్ధంగా లేదు? కారణం సులభంగా అర్థం చేసుకోవచ్చు. లేప్‌ా-లడఖ్‌కు ఆరవ షెడ్యూల్‌ కోసం డిమాండ్‌ నెరవేరితే, అధికారం స్వయంప్రతిపత్తి జిల్లా కౌన్సిల్‌ (ఏడీసీ) చేతుల్లోకి వస్తుంది. ఆరవ షెడ్యూల్లోని నియమాలు, నిబంధనల ప్రకారం, జిల్లా, ప్రాంతీయ కౌన్సిల్‌లు తమ అధికార పరిధిలోని ప్రాంతాన్ని నిర్వహిస్తాయి. లడఖ్‌ సున్నితమైన పర్యావరణ వ్యవస్థతో కూడిన వ్యూహాత్మక ప్రదేశం రాష్ట్ర హోదాను క్లిష్టతరం చేస్తుంది. వారు భూమి, అటవీ, నీరు, సాగు, గ్రామ పరిపాలన, ఆస్తి, వారసత్వం, వివాహం, విడాకులు, సామాజిక ఆచారాలు వంటి కొన్ని విషయాలపై చట్టాలు చేయవచ్చు. లేప్‌ా-లడఖ్‌ సహజ వనరులు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. కనుక బీజేపీ ఆరో షెడూల్‌ ఆమోదం తెలిపితే, లేప్‌ా-లడఖ్‌ భూములను లాక్కొని దేశంలోని బడా ల్యాండ్‌ మాఫియాలకు ఇవ్వడానికి వీలుండదు. పార్లమెంటులో విస్తృత ప్రాతినిధ్యం ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత రాష్ట్ర హోదా రద్దుకు ముందు జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలో ఈ ప్రాంతానికి నాలుగు సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వారికి రాష్ట్ర ప్రభుత్వానికి సమానం ఏమీ లేనందున మొదటిసారిగా తమ రాజకీయ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య హక్కు వారికి లేదు. ఇప్పుడు కూడా వారికి ఒకే ఒక పార్లమెంటు స్థానం ఉంది. అందుకే తమ రాజకీయ ప్రాతినిధ్యం కోసం రాష్ట్ర అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను డిమాండ్‌ చేశారు. నిరుద్యోగం ఈ ప్రాంతంలోని అతిపెద్ద సమస్య నిరుద్యోగం. రాజ్యాధికారం లేనందున, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లేనందున ఈ ప్రాంత యువకులు కనీస ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వారికి సివిల్‌ సర్వీసుల్ల్లో ఉపాధి అవకాశాలు లేవు, జమ్ము కశ్మీర్‌ బ్యాంక్‌, ఇతర బ్యాంకులలో కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. భారత్‌ – చైనా సరిహద్దులో ఉన్న ప్రాంతం వ్యూహాత్మక స్థానం, సున్నితమైన పర్యావరణ వ్యవస్థ, పర్యావరణ క్షీణతకు గురయ్యే అవకాశం రాష్ట్ర హోదాపై చర్చను మరింత క్లిష్టతరం చేస్తుంది. సోనమ్‌ వాంగ్‌చుÛక్‌ ప్రకారం, ఈ సరిహద్దు ప్రాంతంలోని రక్షణ దళాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై సంతోషంగా లేవు. ఇవి సాధారణ డిమాండ్లు కావు. అయితే, ఇవి లడఖ్‌ ప్రజల ఉనికి కోసం, వారి భూములను కార్పొరేట్‌ సంస్థల నుంచి రక్షించడం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. లడఖ్‌ రాష్ట్ర హోదా డిమాండ్‌ కోసం, హిమాలయ ప్రాంతంలో ఉనికి, గౌరవం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అవకాశాల కోసం పోరాటం. సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహారదీక్ష రాష్ట్ర హోదా డిమాండ్‌ కోసం మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య హక్కులు, సమ్మిళిత పాలన, స్థిరమైన అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img