భారతదేశంలో రోజూ 19.3శాతం పిల్లలు ఆకలితో నకనక లాడుతూ జీవిస్తున్నారు. రోజులకొద్దీ ఆహారంలేక పస్తులుంటు న్నారు. అదేసమయంలో వీరికి ఎలాంటి పనులు ఉండటంలేదు. ఏ ఆదా యమూ లేదు. ఆదాయ వనరులు ఏ మాత్రం లభించడంలేదు. కొన్నికొన్ని సమయాల్లో ఆహారంకోసం కలలు కనవలసివస్తోంది. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఆహారం లభించని పిల్లలు 19.3శాతం ఉన్నారు. గునియాలో 21.8శాతం ఉండగా, మాలిలో 20.5శాతం ఉన్నారు. ఆహారం లేక బాధపడే పిల్లల్లో మనదేశం మూడవస్థానంలో ఉంది. దేశంలో పుష్కలంగా నీరు పారే అనేక నదులు, పచ్చదనం వెల్లివిరిసే పొలాలు, అపారంగా సహజసిద్ధమైన ఉత్పత్తి వనరులు ఉన్నాయి. గునియా, మాలిలో సాధారణంగా పిల్లలు 24గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉన్నారని కేంద్రం ఆరోగ్యమంత్రిత్వశ ాఖ పరిధిలో పనిచేసే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (20192021)సర్వేపై గణాంకాన్ని వెల్లడిరచింది. అలాగే కాంగోలో ఆహారం లభించని పిల్లలశాతం 7.4మాత్రమే ఉంది. ఒక్క పాకిస్థాన్లో 9.2శాతం కాగా, నైజీరియాలో 8.8శాతం ఉంది. బంగ్లాదేశ్లో 5.6శాతం ఉండగా, ఇండియా కంటే మేలైన స్థానంలో ఉన్నది. ప్రపంచంలో మన దేశం ఐదవ ఆర్థికస్థానంలో ఉన్నదని ఇది త్వరలో మూడవస్థానానికి చేరుకుంటుందని మోదీ ప్రభుత్వం నిత్యం డప్పు కొట్టుకుంటోంది. భారతదేశంలో ఒకరోజుపాటు పూర్తిగా ఆహారం లభించని పరిస్థితి ఉంది. రాత్రులుసైతం ఆహారం లేక పస్తులు పడుకుంటున్నారు. ఆహారం లభించని రోజులు దిగజారిపోయి ప్రమాదకరస్థాయిలో ఉన్నది. తరువాతి రోజు ఆహారం ఎలాగా అని వేదన చెందుతున్న పిల్లలు అత్యధికంగా ఉన్నారు. తాముపడుతున్న బాధ మరెవ్వరూ పడకూడదని ఆవేదన చెందుతున్నారు. దేశంలో తలసరి ఆదాయంలో 139వ స్థానంలో ఉంది. అయితే ఈ నివేదికకు భిన్నంగా దాదాపు 80 లక్షలమంది పిల్లలకు రోజూ తప్పనిసరిగా ఆహారం లభించడంలేదు. రోజువారీ ఆదాయం ఉంటేనే ఆహారం లభిస్తుంది. తక్కువ, మధ్య తరహా ఆదాయం గల దేశాలలో తాజా సర్వే ప్రకారం, వివిధ కాలాల్లో భిన్నంగా ఉంటున్నాయి. 92 దేశాలలో ఈ పరిస్థితి ఉన్నదని అధ్యయనం చెబుతోంది. తల్లులకు పనులు లభించని రోజుల్లో పిల్లలకు మూడు పూటలా ఆహారం ఉండదు. పౌష్టికాహారం లభ్యత అటు ఉంచి అసలు ఆహారమే లభించని రోజుల్లో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. ఆహారం లభించిన పిల్లలు పెరుగుతున్నారు. ఆహారం లభించని పిల్లలు మూడు
ఆరు నెలల వయస్సు ఉన్నవారు ఎక్కువమంది ఉంటున్నారు. కనీసం పాలు, లేదా ఒక మాదిరి ఘనపదార్థాలు లభించడంలేదు. పైన పేర్కొన్న వయసుగల పిల్లలకు సాధారణంగా తల్లులే ఆహారాన్ని అంది స్తుంటారు. అరకొరగా ఆహారం పెట్టినప్పటికీ కొన్నికేలరీల పైనలభిస్తాయి. పౌష్టికాహారం లేని పిల్లల్లో ఎదుగుదల ఉండదు. తగినవిధంగా పిల్లలు ఎదగడానికి విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ ఉండే ఆహారం ఎంతైనా అవసరం. ఎక్కువ పరిమాణం ఆహారం లభించటం కూడా ఉండటంలేదు. బాలలు రేపటి మానవసమాజం అన్నది ప్రభుత్వం గుర్తించడం లేదు. పదిమంది పిల్లల్లో ఇద్దరికి ఖచ్చితంగా ఆహారం లభించని పరిస్థితులు ఉన్నాయి. 2016 నుంచి పిల్లలకు ఆహారంకొరత చాలా అధ్వాన్నంగా ఉన్నది. తగినంత ఆహారం లభించని, రోజంతా ఆహారం లభించని పిల్లలశాతం 2016 నుంచి మరింత పెరుగుతోంది. 2016లో 17.2శాతం పిల్లలకు ఆహారం లభించకపోగా 2021లో అది 27.8శాతానికి పెరిగింది. ఈ పరిస్థితులు గతంలో ఏనాడూలేవు. ఇప్పుడివి చూస్తూంటే, విభ్రాంతి కలుగుతోంది. తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం కనిపించడంలేదు. ఎంతసేపూ దేశం అభివృద్ది చెందిందని నేటి ప్రభుత్వం ఊదర గొడుతోంది. వాస్తవ పరిస్థితిని వెల్లడిరచడానికి సైతం మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రైవేటుసంస్థలు జరిపే సర్వేలను అసలు గుర్తించడం లేదు. దాదాపు ఆరులక్షల కుటుంబాలలో ఉన్న పిల్లలకు ఎంతవరకు ఆహారం లభిస్తుందనేది అధ్యయనం చేశారు. 2016, 2021లలో అధ్యయనం జరిగింది. తినడానికి ఏదో ఒక పదార్థం దొరకని పరిస్థితు లను పిల్లలు అనుభవిస్తున్నారు. 2021లో ఇండియాలో 6నుంచి 23నెలల కాలంలో 5.7మిలియన్ల మంది ఉన్నట్లుగా నిర్ధారణ జరి గింది. ఆహారం లభించని పిల్లల సంఖ్య యూపీలో అన్ని చోట్లకంటే ఎక్కువగా(27.4శాతం) ఉన్నది. ఆ తరువాత స్థానం చత్తీస్ఘడ్ (24.6శాతం), జార్ఖండ్ (21.21శాతం), రాజస్థాన్ (19.8శాతం), అసోంలో (19.4శాతం) ఉన్నాయి.