***గిరిజన సహకార సంస్థ స్టాల్ ఏర్పాటు
విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం రైల్వే స్టేషన్లో మంగళవారం ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్ ను భారత ప్రధాని మోడీ వర్చవల్ విధానంలో ప్రారంబించి జాతికి అంకితం చేశారు. స్థానిక బెలగామ్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వర్చువల్ విధానంలో రైల్వేశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వికసిత భారత్-నవ నిర్మాణ్ లలో భాగంగా సుమారు 11లక్షల కోట్లతో రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు పనులకు కేటాయించడం జరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగాలని,విదేశీ వస్తువినియోగం తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభం చేశామన్నారు. దేశంలో 504 రైల్వేస్టేషన్లను ఆధునీకరణ చేయడం జరిగిందని, ప్రతీ రైల్వేస్టేషన్ ఒకే మాదిరిగా ఉండాలని, ఎప్పుడు రైల్వే స్టేషన్లు పరిశుభ్రం ఉండేలా చూసుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని ప్రధాని సూచించారు.పార్వతీపురం
జిసిసి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ మాట్లాడుతూ గిరిజనుల ఉత్పత్తులను దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకున్నారని తెలిపారు.ప్రతీ సంవత్సరం గిరిజనులు పండించిన పంటలకు మద్దత్తు ధరలను కల్పిస్తూ, సంక్షేమ ఫలాలను గిరిజనులకు అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో నగర పురపాలక సంఘ అధ్యక్షులు గౌరీశ్వరి,జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు,రైల్వే చీఫ్ ఇంజనీర్ అశోక్ కుమార్, ఏఐడిఎన్ డాక్టర్ సాలూరు మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.