విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంలోని సువర్ణముఖినదికి ప్రక్కనే గల శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రతీ గురువారంనాడు నిర్వహిస్తున్న ముడుపుల పూజలకు వేకువ జాము నుండే భక్తులువివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఓం నమో శ్రీలక్ష్మి నరసింహ స్వామినేనమః అంటూ పూజలలో పాల్గొంటున్నారు. ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, కృష్ణామాచార్యులు, మురారీలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.గురువారంనాడు రక రకాల పూలతో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.ప్రతీగురువారం నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి
నరసింహస్వామీ ముడుపుల పూజలకు వి
దూరప్రాంతాలనుండి వాహనాలతో భక్తజనం పెద్ద ఎత్తున విచ్చేసి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలను చేసి స్వామివారిని దర్శించుకుని, గోవింద గోవింద, జైశ్రీలక్ష్మినరసింహ, ఓం నమో నారాయణాయ అంటూ 27సార్లు ప్రదక్షిణలు చేస్తున్నారు.కొత్త,పాత భక్తులు కలిపి పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో ఉండి పూజలు నిర్వహిస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుందని,జరగాలని భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతీ గురువారం స్వామివారిని వివిధరకాల పూలతో అలంకరించినతీరు, భక్తుల ప్రదర్శనలు,పూజలు, ప్రసాదాలు స్వీకరించడం తదితర అంశాలను అంతా కలిసికట్టుగా ఉండి భక్తులు చేస్తూ అర్చకులకు సహకారాన్ని అందిస్తున్నారు.ఇక్కడ ఉదయం పూట జరుగుతున్న పూజావిధానం చూస్తే సింహాచలం, విజయవాడ, తిరుపతి, తదితర ప్రముఖ ఆలయాల్లో ఉండే ఆధ్యాత్మికత అనుభూతి కలుగుతుంది.