.విశాలాంధ్ర-వలేటివారిపాలెం : రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలనను అందిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్తున్నాడని చుండి సర్పంచ్ ఇరుపని సతీష్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చుండి సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం చుండి సర్పంచ్ ఇరుపని సతీష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిధులుగా జెడ్పిటీసీ సభ్యులు ఇంటూరి భారతి,ఎంపీపీ పొనుగోటి మౌనిక,ఎంపిడిఒ రఫిక్ అహ్మద్,చుండి ఎంపీటీసీ చౌడబోయిన యానాది హాజరైనారు.ఈ సందర్బంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు అయిందని ఇప్పటికే లక్షల కోట్లు ప్రజల ఖాతాలోకి వేశాడని ఆయన పేర్కొన్నారు.జగనన్న సురక్ష ద్వారా అనేక ధ్రువపత్రాలను అందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్బంగా లబ్ధిదారులు పెట్టుకున్న 11రకాల సర్వీసులకు సంబందించిన ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలమీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి,మండలజేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు,సచివాలయకన్వీనర్ ఇరుపని అంజయ్య,చుండి ఆదర్శపాఠశాల చైర్మన్ ఇరుపని వీరవెంకటసత్యనారాయణ,వైసీపీ నాయకులు ఇరుపని లక్ష్మీనరసింహం,ముతకని రామాంజయ్య,కండె నరసింహం,గౌరవపు నాగేంద్రబాబు,సచివాలయసిబ్బంది, గృహసారధులు,వలంటీర్లు,లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.