. టేబుల్ టెన్నిస్ ఫైనల్కు చేరిన పటేల్
. భారత్ ఖాతాలో పతకం ఖాయం
. నేడు ఫైనల్లో టాప్ సీడ్తో పోరు
టోక్యో: పారాలింపిక్స్లో భారత్కు కనీసం రజత పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన ఫైనల్కు దూసుకెళ్లింది. భవీనా సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోపై 3-2 తేడాతో విజయం సాధించింది. ఇక మ్యాచ్లో భవీనాబెన్ కీలక సమయంలో ప్రత్యర్ధిపై ఆధిóపత్యం ప్రదర్శించి ఫైనల్లో స్థానం ఖాయం చేసుకుంది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపుతూ భవీనా జాంగ్ మియావోపై 7-11, 11-7, 11-4, 9-11, 11-8 స్కోరుతో గెలుపొందింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే నిరుత్సాహ పడకుండా భవీనా వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భవీనా మూడో గేమ్ను కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం గమనార్హం. ఈ దశలో కీలకమైన నాలుగో గేమ్లో ప్రత్యర్థి జంగ్ పట్టుదలతో ఆడిరది. పోటా పోటీగా సాగిన ఈ గేమ్లో ఫలితంగా ప్రత్యర్ధికే అనుకూలంగా వచ్చింది. దీంతో స్కోరు 2-2తో సమమైన మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో గేమ్కు దారితీసింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా ఆఖరి గేమ్లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జాంగ్ సైతం వేగంగానే స్పందించి ఆధిక్యాన్ని 9`8కి తగ్గించింది. ఈ క్రమంలో టైమ్ఔట్ తీసుకున్న భవీనా ఆట మొదలవ్వగానే వరుసగా రెండు పాయింట్లు సాధించి సగర్వంగా ఫైనల్కు చేరుకుంది. స్వర్ణ పతక పోరులో భవీనా ప్రపంచ నంబర్వన్ రaౌతో ఆదివారం తలపడనుంది.
స్వర్ణం గెలుస్తా.. నేనిక్కడికి వచ్చినప్పుడు మరేం ఆలోచించకుండా వంద శాతం శ్రమించాలని అనుకున్నా. అలా అయితేనే పతకం కచ్చితంగా వస్తుంది. నా దేశ ప్రజల ఆశీర్వాదాలు, ఇదే ఆత్మవిశ్వాసంతో కొనసాగితే ఆదివారం కచ్చితంగా స్వర్ణం గెలవగలను. నేను పసిడి పోరుకు సిద్ధంగా ఉన్నాను’ అని భవీనా సెమీస్ తర్వాత మీడియాకు చెప్పింది. భవీనాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఒత్తిడి లేకుండా ఆడాల్సిందిగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.