విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పరమ పితా వెంకటరమణాచార్య గురువు యొక్క 12వ ఆరాధన మహోత్సవ వేడుకలు పరమ సంస్థానం పరమపిత వెంకటరమణాచార్య గురువు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, శంషాద్ బేగం హాజరై నారు. ఈ కార్యక్రమం పరమ సంస్థాన వ్యవస్థాపకురాలు యోగి ముక్తేశ్వరి మాతాజీ, ద్వితీయ పీఠాధిపతి మోక్షి ముక్తేశ్వరి మాతాజీ ఆధ్వర్యంలో మూడవరోజు ఘనంగా జరిగాయి. అనంతరం మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీ మాట్లాడుతూ పరమపిత శ్రీ వెంకటరమణాచార్య గురువు చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. అనంతరం వారి చేతుల మీదుగా రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం యోగి ముక్తేశ్వరి మాతాజీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సేవా గుణమును అలవర్చుకోవాలని, పేదలను తమకున్న స్థాయిలో ఆదుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ కోశాధికారి రామాంజనేయులు ఆచారి ఉప కోశాధికారి మల్లికార్జున కోశాధికారి నాగభూషణ, వైఎస్ఆర్సిపి నాయకులు కాచర్ల అంజి,కొత్తపేట వార్దు ఇంచార్జ్ చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు,