ఇద్దరు వ్యక్తులు అరెస్ట్… వన్ టౌన్ సీఐ. సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్ లోని హోటల్ వద్ద ఆంధ్ర అండ్ కర్ణాటక మద్యం అమ్ముతున్న వనం లక్ష్మీనారాయణ, అతని భార్య వనం గంగమ్మలను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి మూడు ఆంధ్ర లెక్కరు, పది ఎన్డిపిఎల్ కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. రాబడిన సమాచారం మేరకు ఏఎస్ఐ పుట్టప్ప, కానిస్టేబుల్ అబ్దుల్, శశికళ సహకారంతో ఈ అక్రమ మద్యం రవాణాను చేదించినట్లు తెలిపారు. పట్టణంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మిన, రవాణా చేసిన, గంజాయి అమ్మిన, మట్కా అండ్ పేకాట ఆడిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు. పై సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే సిఐ నెంబర్ 944 0796831 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు…