విశాలాంధ్ర ధర్మవరం:: బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ధర్మవరం రూరల్ బీజేవైఎం నూతన కమిటీని నియమించారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షుడిగా నీరు గంటి పోతలయ్య వాల్మీకి ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోతులయ్య మాట్లాడుతూ నన్ను బీజేవైఎం ధర్మవరం రూరల్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు, రూరల్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి అరవింద్ రెడ్డికి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రవితేజ రెడ్డికి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ రెడ్డికి, బిజెపి జిల్లా అధ్యక్షుడు జి.యం. శేఖర్కు ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలిపారు. బిజెపి పార్టీ అభివృద్ధి కొరకు తాను అహర్నిశలు కృషిచేసి, పార్టీ అభివృద్ధికి తోడ్పడుతారని తెలిపారు.