Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

విశ్వేశ్వర రెడ్డి గెలిస్తేనే అభివృద్ధి

-యువనేత వై. ప్రణయ్ రెడ్డి

విశాలాంధ్-: ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేయడం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, వారి జీవితాల్లో వెలుగులు వుంటాయని వైస్సార్సీపీ యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై. ప్రణయ్ రెడ్డి అన్నారు. వైస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి, వై. విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని షిర్డీసాయి నగర్, అయ్యప్పస్వామి స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లారు. ఫ్యాను గుర్తు కు ఓటు వేసి ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గెలిస్తేనే ఉరవకొండ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు ఇదొక్కసారి విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. కచ్చితంగా ప్రజలు ఆశించిన అభివృద్ధిని అందించి ఉరవకొండను ఆదర్శవంతగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img