విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నారాయణ సేవలో భాగంగా వైద్యులచే 300 మంది రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా 450 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో నిర్వహిస్తున్నామని కన్వీనర్లు తెలిపారు. మానవసేవే మాధవసేవ అన్న స్ఫూర్తితో తాము ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలను అనాధలను వివిధ రూపాలలో ఆదుకున్నప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని, మానవ జన్మకు సార్థకం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సాంబశివుడు, వెంకటేశులు, నాగిరెడ్డి, బండ్లపల్లి బదిరీ,శేషాచారి, కాకుమాని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.