సర్వ ధర్మ నిలయం ట్రస్ట్, సద్గురు భం భం బాబా సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని మార్కెట్ యార్డ్ ఎదురుగా గల సిఎన్బి గార్డెన్స్ లో సర్వధర్మ నిలయం ట్రస్టు సద్గురు భం భం బాబా సేవా సమితి ఆధ్వర్యంలో సద్గురు అన్వర నంద స్వాముల వారి ఆరాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భం భం బాబా భక్తాదులు పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. తొలుత పాండురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వందలాదిమంది మహిళలు బోనాలను తల పైన పెట్టుకొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. తదుపరి ప్రత్యేక వాహనంలో భం భం బాబా చిత్రపటాన్ని ఆసీనులు చేసి, వివిధ పూలమాలలతో అలంకరించి అన్వరనంద స్వాముల వారిచే ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. వందల మంది భక్తాదులు స్వామివారి ఆశీస్సులను పొందారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మహిళల బోనాలు, భక్తాదుల భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. తొలుత సద్గురు అన్వర నంద స్వామి వారికి భక్త బృందం, అర్చకులు పూర్ణకుంభం ద్వారా స్వాగతం పలికారు. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భం భం బాబా భక్తులతో పాటు వివిధ జిల్లాల నుండి వందలాదిమంది భం భం భక్తులు పాల్గొని, ఆరాధన కార్యక్రమాల్ని విజయవంతం చేశారు.