Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పట్టణ అభివృద్ధికి తప్పకుండా నా వంతు కృషి చేస్తాను…

నూతన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ అభివృద్ధికి తన వంతుగా తప్పకుండా కృషి చేసి అభివృద్ధికి బాట వేస్తానని నూతన పురపాలక కమిషనర్ రామ్కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం కౌన్సిలర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని పలు సమస్యలను కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కా చర్ల లక్ష్మి, కమిషనర్ దృష్టికితీసుకుని వచ్చారు. పట్టణంలో వీధి దీపాలు లేకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి కౌన్సిల్ కు ఈ సమస్యను తెచ్చినా కూడా పరిష్కారం కావటం లేదని కౌన్సిలర్లు తెలిపారు. స్పందించిన చైర్మన్ ప్రతి సచివాలయానికి 10 ట్యూబ్ లైట్లు ఇస్తామని అవసరమైన వారు ఆ ట్యూబ్ లైట్లు వాడుకోవాలని తెలిపారు. అదేవిధంగా వార్డుల్లో కాలువలు శుభ్రత తూతూ మంత్రంగా జరుగుతోందని, పూర్తి దశలో జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని, అప్పుడే మాకు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని కౌన్సిలర్లు తెలిపారు. తొలుత నూతనంగా బదిలీ అయి వచ్చిన మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులకు వారు పరిచయాన్ని చేసుకున్నారు. పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు తమ సహాయ సహకారాలు అందించాలని, తద్వారా తాను వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులను పనుల సమస్యలను పరిష్కరించుటలో నిరంతరం శ్రమ చేసేందుకు పాటుపడతారని తెలిపారు. అదేవిధంగా బరేట్ గ్రౌండ్లో ఇప్పటికే కొరతగా ఉందని, ఈ సమావేశంలోనైనా ఓ నిర్ణయం తీసుకొని స్థలాన్ని వేగవంతంగా కేటాయించాలని తెలిపారు. పట్టణాలలో ఉన్న సమస్యలను కౌన్సిలర్లుగా తాము అధికారుల దృష్టికి తెస్తున్న కూడా పరిష్కారం కావడం లేదని, సీరియస్ గా సమస్యలను పరిష్కరించుటలో అధికారులు మరింత చోరువ చూపాలని కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం ఎండాకాలం ఉన్నందున వార్డుల్లో నీటి కొరత లేకుండా చేయాలని, విద్యుత్ సమస్యల పట్ల నీటికి అంతరాయం కాకూడదని తెలిపారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నాయెడల కమిషనర్ గా నా దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించే దిశలో తాను ఎల్లప్పుడూ ఉంటానని కమిషనర్ తెలిపారు. తదుపరి అజెండాలోని 32 అంశాలపై కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. ప్రతి వార్డులోనూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేసుకునే పద్ధతికి వార్డు కౌన్సిలర్లు తమ సహాయ సహకారాలు అందించి, వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఓట్లు నమోదు ఉండేలా చూడాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నియమ నిబంధనలు అందరూ పాటించేలా సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ ఆనంద్ కుమార్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ- సత్యనారాయణ, డిఇలు ప్రకాష్ ,వీరేష్, ఏఈలు కళావతి, ప్రతాప్, టిపిఆర్ఓ సుబ్బరాయుడు, మెప్మా వెంకటేశులు, డిఈ .వన్నూరప్ప, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img