ఉపాధి హామీ సిబ్బంది నిర్వాకం
విశాలాంధ్ర: చిలమత్తూర్ రూరల్ (శ్రీ సత్య సాయి జిల్లా) : బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు పనులు కల్పించే మహోన్నత కార్యక్రమముగా పేరుగాంచిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పైసలిస్తే పనులు చూపిస్తామని స్థానిక ఉపాధి హామీ సిబ్బంది నిర్వాకం సూచించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. అడిగిన వెంటనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పేదలకు పనులు కల్పించాల్సిన అధికారులు, తాము పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా నిర్మూలించాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే, బ్రతుకు దేవుడా అంటూ కాయ కష్టాన్ని నమ్ముకున్న కూలీల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు కు పలువురికి రెండు నెలలైనా కూలీల డబ్బులు ఇవ్వలేదంటూ అడగగా మీరు ఎక్కడ పనిచేశారు అంటూ వ్యంగముగా సమాధానం చెప్పడంతో ఆక్రోసించిన కూలీలు , పనిచేసి రెండు నెలలు అయినదని దాదాపు 30 మందికి కూలీలు ఇవ్వాలని తెలపగా, వారిపై టెక్నికల్ అసిస్టెంట్ అయూబ్ అన్సార్ చిరుబురులాడాడు, విషయం తెలుసుకొన్న ఏపీవో అప్పు స్వామి నాయుడు వారితో సమాధాన పరుస్తూ త్వరలో చేసిన పనులు పరిశీలించి ఆ బిల్లు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అధికారి మా గ్రామంలో పైసలు ఇచ్చిన వారికే పనులు చూపిస్తున్నాడని, ఇవ్వని వారికి పనులు లేవంటూ వెనక్కి పంపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఇది ఇలానే కొనసాగితే మా కూలీల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో నిరుపేద కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీలో పనులు కల్పించి ఆదుకోవాలని, చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారితోపాటు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.