విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మేనేజ్మెంట్ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులు, అధ్యాపకులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నట్లు కరెస్పాండెంట్ చాంద్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం కరెస్పాండెంట్ చాంద్ భాషా, ప్రిన్సిపాల్ ఫణి కుమార్ మాట్లాడుతూ మేనేజ్మెంట్ యొక్క ఆవశ్యకతను, కంపెనీలలో మేనేజర్ యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను గూర్చి తెలిపారు. విద్యార్థులు పరీక్షా సమయంలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వారికి సూచించారు. మేనేజ్మెంట్ విద్యార్థులు మాట్లాడుతూ “ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్- హెన్రీ ఫెయిల్” గురించి, ఆయన చెప్పిన 14 సూత్రాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ అధ్యాపకులు శ్రీనివాసులు, రేవతి, ఇతర అధ్యాపకులు, మేనేజ్మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు.