విశాలాంధ్ర ధర్మవరం:: హైపర్ టెన్షన్ (బిపి) అనే వ్యాధి పట్ల ప్రజలు తప్పనిసరిగా నిర్ధారించుకొని తగిన వైద్య చికిత్సలను పొందాలని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ బీపీ అనేది నేటి కాలంలో సర్వసాధారణమైనదని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు, గ్రామీణ ప్రాంతాలలో బీపీ పట్ల నిర్లక్ష్యం ఉంటే పెద్ద ప్రమాదానికి గురికావాల్సి వస్తుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుకూలమైన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో బీపీ యొక్క నిర్ధారణ పట్ల మందులను ఉపయోగించుకోవాలని తెలిపారు. వైద్యుల యొక్క సలహాలతో పాటు వైద్య చికిత్సలను పొందుతూ సమయాను ప్రకారం విధిగా మందులు వేసుకోవాలని తెలిపారు. బీపీ పట్ల తగిన వైద్య చికిత్సలతో పాటు మందులను వేసుకుంటే దీర్ఘకాలంగా జీవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పక బిపి పట్ల నిర్ధారించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని తెలిపారు.