మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రజలందరూ కూడా పట్టణ పరిశుభ్రతకు సహకరిస్తే పట్టణములోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల, అనారోగ్యం వస్తుందని, కాలవల్లో నీరు వెళ్లడానికి అవకాశం లేకుండా వేరే పదార్థాలు వస్తువులు వేయడం వల్ల నీరు సరఫరా కాకుండా రోడ్ల మీదికి మురికి నీరు వస్తోందని తెలిపారు. అదేవిధంగా పట్టణములోని 40 వార్డులకు షెడ్యూల్ తేదీల ప్రకారం ఆటోలలో తడి, పొడి చెత్త వేయాలని తెలిపారు. ఇక వాణిజ్య సదుపాయములలో వ్యాపారం చేసే వ్యాపారస్తులందరూ కూడా తప్పనిసరిగా మున్సిపల్ టాక్టరు లేదా ఆటోలోనే వేయాలని తెలిపారు. తోపుడుబండ్ల వారు తమ దగ్గర ఉన్న చెత్తను కేటాయించిన వద్ద మాత్రమే వేయాలని తెలిపారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలతో పాటు జరిమానా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఎండాకాలం ఉన్నందున మున్సిపాలిటీ ద్వారా వచ్చు తాగునీరు, ఉప్పునీరును పొదుపుగా వాడుకోవాలని, నీటిని వృధా చేస్తే ఇతర వార్డులకు నీటి కొరత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత సచివాలయ సిబ్బందికి నీటి విషయములో చెత్త విషయములో పలు హెచ్చరిక సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని, సచివాలయ సిబ్బంది ద్వారా ఫిర్యాదు అందితే తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు. మునిసిపాలిటీకి చెల్లించాల్సిన పనులను సకాలంలో చెల్లిస్తే పట్టణము అభివృద్ధి దిశలో నడుస్తుందని తెలిపారు. వార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయెడల తనకు నేరుగా తెలుపు కొంటె సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.