రిటైర్డ్ కంటి.. రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్. నరసింహులు.
విశాలాంధ్ర -ధర్మవరం : కంటిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో జాతీయ అందత్వ నివారణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు జాతీయ అందత్వ నివారణ వారోత్సవాల యొక్క ప్రాధాన్యతను వివరించారు. తదుపరి వారు మాట్లాడుతూ ఈ జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాలు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. నేత్రో రక్షితి రక్షితః-కంటిని మనం కాపాడుకుంటే, అదే మనల్ని కాపాడుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని తెలిపారు. మానవుని జీవన విధానంలో కంటిచూపు కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. కంటి చూపు లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. కొద్దీ సేపు కంటిని మూసుకుంటే,చీకటి దుర్భర పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని తెలిపారు. పుట్టినప్పటి నుండి వృద్ధుల వయసు వరకు తప్పనిసరిగా కంటిచూపులు కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని తెలిపారు. ఆ కంటి భద్రతను రక్షించుకోవలసిన అవసరం ఉన్నప్పుడే కంటిచూపు అందరికీ లభిస్తుందని తెలిపారు. కంటి జబ్బులు అనేక రకాలుగా ఉంటాయని వాటిని తేలికగా నివారించవచ్చునని తెలిపారు. మరికొన్ని చికిత్సను కూడా కంటి చూపును పునరుద్దించే అవకాశం ఉందని తెలిపారు. కంటి సంరక్షణ యొక్క అవసరాన్ని సమాజంలో తెలియజేసి, అందులో గల అవకాశాలను ఉపయోగించేటట్లు అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. సమాజ అవగాహన ద్వారానే కంటి సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. తమసోమా జ్యోతిర్గమయా అనగా చీకటి నుండి వెలుగులోనికి తెచ్చేదే కన్ను అని తెలిపారు. కంటి చూపు తగ్గిన వారికి చీకటిలో మగ్గుతున్న వారికి వెలుగులోనికి తీసుకొని రావడమే మా లక్ష్యము అని తెలిపారు. ఏది ఏమైనా తల్లిదండ్రులు గాని, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, యువతి యువకులు గాని, విద్యార్థులు గాని కంటి చూపు పట్ల బాధ్యతగా వహించినప్పుడే జీవితములో చక్కటి కంటి చూపు లభిస్తుందని తెలిపారు.