విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి కృప జూనియర్ కళాశాలలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలు సిపిఐ, సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్హెచ్ భాష అధ్యక్షా జరిగింది. ముఖ్య అతిథులుగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ శేషు, ఆంధ్ర ప్రదేశ్ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి జే.వి రమణ ,సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఎం పట్టణ కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున, సిఐటియు జిల్లా నాయకులు, సిపిఐ పట్టణ కార్యదర్శి రమణా పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో ఆలమ గారి పల్లి గ్రామంలో జన్మించాడని, విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలకు ఆకర్షితులై, గ్రామీణ ప్రాంతాలలో దళిత గిరిజన వెనుకబడినటువంటి వర్గాల విచక్షణకు రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక పోరాటాలు చేసిన మహా నాయకుడు అని తెలిపారు. అదేవిధంగా వారు పార్లమెంటు కు ఎన్నికైన తర్వాత సమావేశాలకు సైకిల్ మీద లేదా బస్సుల్లో వెళ్లి హాజరై సమస్యల పైన మాట్లాడిన తర్వాత వాటిని అధ్యయనం చేసి ఒక రిప్రజెంటెడ్ ను, ఒక వినతి పత్రం రూపంలో తయారుచేసి, ప్రధానమంత్రి ఇంటికి వెళ్లి ఇచ్చేవారని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేసే వారిని తెలిపారు. తదుపరి వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకొని నిస్వార్ధంగా పోరాటాలకు అంకితమయ్యారని తెలిపారు. వారి ఆశయ సాధనాలకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ,కార్యదర్శులు సరస్వతీ, చంద్రకళ, యూనియన్ నాయకులు పోతాక్క, ఫాతిమా, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షులు మేకల బాబు, కార్యదర్శి ముకుంద, వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న కేశవులు, సలహాదారుడు ప్రసాద్, సూరి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.