Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగన అశ్వత్థ నారాయణ

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముచ్చటగా మూడవసారి కాంగ్రెస్ పార్టీ నుండి పట్టణానికి చెందిన చేనేత వర్గీయుడు, స్థానికుడు, బిసి సామాజిక వ్యక్తి, రంగన అశ్వత్థ నారాయణ ను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే. సి.వేణుగోపాల్ అధికార పూర్వకంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రంగన అశ్వత్త నారాయణ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కు, ఏఐసీసీ జనరల్ కార్యదర్శి కే సి వేణుగోపాల్ కు, సిడబ్ల్యుసి సభ్యులు రఘువీరారెడ్డికి, ఏపీ సీసీ అధ్యక్షురాలు షర్మిలాకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలిపారు. నేను ధర్మవరంలో మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవడం జరిగిందని, పార్టీ అభివృద్ధికి, ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలవడానికి తన వంతు కృషి చేస్తూ, అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళతానని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రంగన్న అశ్వత్త నారాయణకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img