ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు పరిమితికి మించి అధిక సంఖ్యలో విద్యార్థులను పాఠశాలలకు బస్సులలో పంపడము లో ప్రమాదాలు జరుగుతాయని వెంటనే చర్యలు గైకొరాలని కోరుతూ ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య, జిల్లా అధ్యక్షులు జగదీష్ వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో నడుపుతున్న బస్సులకు అన్ని పర్మిట్లు ఉన్నాయా? లేదా? బస్సు కండిషన్ ఎలా ఉంది? అన్న విషయాలపై వెంటనే విచారణ జరపాలని, ప్రభుత్వ నియమ నిబంధనలకు ఉల్లంఘిస్తూ వ్యాపారమే ధ్యేయంగా నేడు పాఠశాలలు నడుస్తున్నాయని తెలిపారు. ప్రతి బస్సు కు స్పీడోమీటర్ ఫస్టియర్ ఇలాంటివి ఏవి లేవని తెలిపారు, అదేవిధంగా ప్రతి డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇష్టానుసారంగా పట్టణములో నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ జిల్లా కార్యదర్శి సాయికిరణ్, ఉపాధ్యక్షులు జైపాల్, యాసిన్, గణేష్, హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.