కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ
విశాలాంధ్ర -ధర్మవరం:: ఈనెల 13వ తేదీన ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం టౌన్, రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు, పోలీసులకు, ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వత్థ నారాయణ కృతజ్ఞతలు తెలియజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో కన్నా, ఈసారి మహిళలే అధిక సంఖ్యలో పాల్గొనడం, అధిక శాతములో ఓట్లు నమోదు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. కాకపోతే పలు పోలింగ్ కేంద్రాలలో తగిన మౌలిక వసతులు లేకపోవడం బాధాకరమని తెలిపారు. అయినా ఓటర్లు ఎండను లెక్కచేయక 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో వారికి ఎంతో బాధ్యతగా తమ పనిని నిర్వర్తించడం అభినందించేదగ్గ విషయమని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సిపిఐ, సిపిఎం,కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు నా వెన్నంటే ఉండి ప్రచారమును నిర్వహించడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోందని తెలుపుతూ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటర్ల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు.