ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ శర్మ
విశాలాంధ్ర ధర్మవరం:బీ పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ శర్మ, ఆలయ యజమానులు, శివదీక్ష మారాధారణ కమిటీ, భక్తాదుల, కల్యాణోత్సవ ఉభయ దాతల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. అనంతరం ద్వారకనాథ్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ యజమానులు భక్తాదుల సహాయ సహకారాలతో ఇటువంటి కళ్యాణోత్సవ వేడుకలు నిర్వహించుట ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. తొలుత వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై జరిగిన కళ్యాణ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తకోటి శివనామ స్మరణ మధ్య ఈ కళ్యాణం అత్యంత అద్భుతంగా భక్తజన రంజకంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి జడ్జి గీతావాణి రమేష్ బాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారని వారు తెలిపారు. అనంతరం వందలాదిమందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ వేడుకలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ శర్మ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.