జనసేన యువ నాయకులు అరిగెల భాస్కర్
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం పై ఎన్నికల ప్రచారం చేసి అపూర్వ విజయం సాధించారని ఆయన గెలుపు యువత కు చైతన్యం అని ధర్మవరం జనసేన యువ నాయకులు అరిగెల భాస్కర్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పదే పదే ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఎంతో కృషి చేసిన పవన్ కళ్యాణ్ పొత్తు తో టీడీపీ భారీ మెజారిటీ సాధించడానికి దోహద పడ్డారని, జనసేన మేలు కూటమి మరువలేదని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం మన రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి గా నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం లో కి రావడం తెలుగు ప్రజల అదృష్టం అన్నారు. ధర్మవరం కూటమి అభ్యర్థి వై. సత్య కుమార్ బీజేపీ ఎమ్మెల్యే గా నూతనము గా ఎంపిక కావడం ధర్మవరం ప్రజలు కోరుకున్న కల నెరవేరిందన్నారు.యువత కు తెలుగు దేశం అధినేత రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక స్ఫూర్తి అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు పట్ల పలువురు జనసేన యువత హర్షం ప్రకటించారు.