విశాలాంధ్ర ధర్మవరం:: గ్రామ ప్రజలు సమన్వయంతో ఉంటూ, చట్ట పరిధిలోనే జీవించాలని రూరల్ ఎస్సై నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని సుబ్బారావుపేట గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేంద్ర మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి హింసకు తావు లేకుండా ఉండాలని, గొడవలు చేసిన, ప్రోత్సహించిన అది నేరమవుతుందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలని, ఎన్నికల తర్వాత గాని ముందుగానే ఎటువంటి గొడవలు సృష్టించిన, పాల్గొన్న కూడా తీవ్రమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. గ్రామ ప్రజలు జూన్ 4వ తేదీ వరకు సమన్వయంతో ఉంటూ, ఎవరి జోలికి పోకూడదని, గొడవలు పెట్టుకోవద్దని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు పాల్గొన్నారు.