విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణలో 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నారాయణరెడ్డి, నల్గొండ కలెక్టర్గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా హనుమంతరావు నియమితులయ్యారు. వివరాలు… టి.కె.శ్రీదేవి – పురపాలక శాఖ డైరెక్టర్, మంద మకరందు – సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్, జెడ్.కె. హనుమంతులు – పర్యాటకశాఖ డైరెక్టర్ … దేవదాయశాఖ సంచాలకులుగా అదనపు బాధ్యతలు, శశాంక- రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్, ఎస్.హరీశ్ – ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్… విపత్తు నిర్వహణశాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, వినయ్కృష్ణారెడ్డి – ఆర్ అండ్ ఆర్ భూసేకరణ కమిషనర్, ఆయేషా మస్రత్ – వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి, వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు, కె. చంద్రశేఖర్రెడ్డి – డెయిరీ కార్పొరేషన్ ఎండీ, ఎస్. దిలీప్కుమార్ – నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, సోని బాలదేవి – క్రీడాశాఖ సంచాలకులు (అదనపు బాధ్యతలు), కొర్రా లక్ష్మి – రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ… స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు, ఎన్. క్షితిజ – ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, సుభద్రా దేవి – జీహెచ్ఎంసీ అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్, జి.జ్ఞానేశ్వర్ – వికారాబాద్ డీఎఫ్ఓగా నియమితులయ్యారు.