అచ్చంపేటలో బుధవారం బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడిన ఘటనపై.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ామీరు చెప్పే ాప్రేమను పెంచడం్ణ అంటే ఇదేనా రాహుల్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రశ్నించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో కేటీఆర్ ఒక పోస్ట్ పెట్టారు.ఆ పోస్టుకు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలపై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోస్టు చేసిన వీడియోను కేటీఆర్ జతచేశారు. కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ దాడులు, దుర్భాషల్లో పోలీసులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు.దాడికి పాల్పడిన గూండాలపై, ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తాము మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామంటూ తెలంగాణ డీజీపీ ని టాగ్ చేశారు. తాము కచ్చితంగా న్యాయాన్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.