ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు వాదనలు విని… తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈరోజు కవిత తరఫు లాయర్లు, ఈడీ తరఫు లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈడీ రిప్లై రిజాయిండర్కు కవిత తరఫు న్యాయవాదులు సమయం కోరారు. ఏప్రిల్ 3న సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. గురువారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపట్టనుంది.