తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఆర్టీసీ బిల్లు తెరపైకి వచ్చింది. శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. కేసీఆర్ సర్కార్ ఈ బిల్లును గవర్నర్ తమిళిసైకు పంపి రెండు రోజులు గడిచినా.. రాజ్భవన్లో ఆమోదం తెలపలేదు. ప్రభుత్వం ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టాలని భావించింది.. ఈ బిల్లు ఆర్థికపరమైనది కావడంతో గవర్నర్కు పంపించింది. తమిళసై బిల్లుకు ఆమోదం తెలుపుతారా.. తిప్పి పంపుతారా, పెండింగ్లో పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఈ బిల్లును గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అయితే తమకు ఎలాంటి బిల్లు అందలేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ బిల్లు విషయంలో గందరగోళం కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనుండటంతో ఏం జరుగుతుందో అన్నది చూడాలి.