Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మానవాళికి పత్రీజీ చేసిన మహోపకారం శ్వాస మీద ధ్యాస

ప్రముఖ సినీ గేయ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి

పత్రీజీ ధ్యానమహా యాగంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

విశాలాంధ్ర -అమనగల్లు : : మానవాళికి పత్రీజీ చేసిన మహోపకారం శ్వాస మీద ధ్యాస అని ప్రముఖ సినీ గేయ రచయిత, నటుడు తనికెళ్ళభరణి అన్నారు. 30 ఏళ్ల క్రితం పత్రీజీ నాటిన విత్తనం నేడు ప్రపంచవ్యాప్తంగా వట వృక్షంవలే విస్తరించిందని అన్నారు. ఈ మేరకు సోమవారం ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ కోరుప్రోలు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదో రోజు కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి పిరమిడ్ కు చేరుకున్న ధ్యానులు పత్రీజీ శక్తి స్థల్ ను సందర్శించి ధ్యానంతో నివాళులర్పించారు. ఈ సందర్బంగా హాజరైన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ధ్యానానికి కుల, మత భేదం లేదని ఊపిరి తీస్తున్న ప్రతీ ఒక్కరూ ధ్యానం చేయొచ్చునని అన్నారు. 30 ఏళ్లుగా పత్రీజీతో తనకున్న సన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. నిస్వార్థంగా పత్రీజీ చేన చెస్తున్న సేవ గొప్పదని కొనియాడారు. ఈ సందర్బంగా నాలోన శివుడు గలడు అనే పాటను ఆయన ఆలపించి ధ్యానుల్ని రంజింపజేశారు. పత్రీజీ కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ మాట్లాడుతూ సంకల్పానికి ధ్యానం తోడైతే అద్భుతాలు సృష్టించబడతాయని బ్రహ్మర్షి పత్రీజీ మనకు ఐదు రకాల ధ్యానాలు సమూహిక ధ్యానం, సంగీత ధ్యానం, ప్రకృతి ధ్యానం, పౌర్ణమి ధ్యానం, పిరమిడ్ ధ్యానాలను అందించారని అన్నారు. పత్రీజీ తాను చేసిన 33 ఏళ్ల ధ్యాన సేవను అందరి భుజాలపై వేసి వెళ్లారని అన్నారు. దేవుని రాజ్యం నీలోపల ఉందని, రెండు కళ్ళు ఒక్కటి ఐతే తప్ప దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేమని జీసెస్ ప్రబోధించారనిఅన్నారు. జీసెస్ అంటేనే ప్రేమ, కరుణ, త్యాగం అని కోడిని, మేకను రక్షించడమే క్రిస్టియానిటీ అని పత్రీజీ వీడియో సందేశంలో తెలిపారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని జీసస్ చెప్పారని, పొరుగువారు అంటే సకల జీవకోటి అని అర్థం అని తెలిపారు. క్రిస్మస్ వేడుకలను పత్రీజీ ధ్యానమహా యాగంలో ఘనంగా నిర్వహించారు. విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఃపత్రీజీ శక్తిస్థల్-స్టాచ్యూ అఫ్ మెడిటేషన్ ఫర్ వన్ నెస్ః నిర్మాణానికి ప్రతీ పిరమిడ్ మాస్టర్ విరివిగా సహాయ సహకారాలు, విరాళాలు అందిజేయాలని కోరారు. అనంతరం గణేష్ సంగీత, వేణు నాధ బృందాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం పత్రీజీ స్టాచ్యు, డైరీలు, క్యాలెండర్లు, పిరమిడ్ ధ్యాన శక్తి అనే కన్నడ, సొల్ జర్నీ హిందీ పుస్తకాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిణితిత పత్రీ, రాంబాబు, మాధవి, నిర్మల దేవీ మాకం, శ్రీరామ్ గోపాల్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img