Monday, May 20, 2024
Monday, May 20, 2024

శివాలయములో ప్రత్యేక పూజలు చేసిన ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం=పట్టణములోని తిక్క స్వామి నగర్లో వెలసిన పురాతన శివాలయంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు. ఆలయంలోని శివునికి, అర్చనలు అభిషేకములు నిర్వహించారు. కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని సత్య కుమార్ యాదవ్ తెలిపారు. తదుపరి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జింక చంద్ర, సాకే ఓబులేసు, భక్తవత్సలం, గుండా పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img