ఆర్డీవో, రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో 144 సెక్షన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు అమలులో ఉంటుందని ఆర్డిఓ, రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, రెచ్చగొట్టే విధంగా ఎటువంటి వాట్సప్లో ఉండరాదని, అలా ఉన్న యెడల ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడునని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు పై విషయాన్ని గమనించి సహకరించాలని తెలిపారు.