విశాలాంధ్ర- శింగనమల : బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామం లోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు 14వ పటాలము యందు పటాలము ఎస్పీ ప్రభు కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2024 కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరై దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు.
గత వైసిపి ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి డిప్యూటేషన్ పై ఉద్యోగరీత్యా వెళ్లి ఎర్రచందనం ముఠా దాడిలో పోరాడి ప్రాణాలర్పించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ గణేష్ కుటుంబానికి
14వ బెటాలియన్ తరపున ఎమ్మెల్యే జ్ఞాపకను అందజేసి కానిస్టేబుల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు ఎంతో ధైర్య సాహసాలతో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి,చట్టాన్ని రక్షిస్తూ,ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, సమాజానికి అండగా నిలుస్తున్నారని .ప్రజల కోసం,దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటు,పోలీసుల నిస్వార్థ సేవలకు,అంకిత భావాలకు కట్టుబడి ఉందామని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ పేర్కొన్నారు.