జనసేన ఇన్చార్జ్ సందీప్ పంచకర్ల
విశాఖ జిల్లా ,విశాలాంధ్ర : పద్మనాభం మండలంలోని అయినాడ గ్రామంలో జనసేన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ఈ మేరకు జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ ఆధ్వర్యంలో గురువారం పల్లె యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని రాజ్యలక్ష్మి అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయినాడు చివరి గ్రామమైన సత్యనారాయణపురంలో శిరిడి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి పల్లె యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అయినాడలోని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమిని గెలిపించడానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రస్తుతం ఉన్న పథకాలు కొనసాగిస్తూనే ప్రజలకు అవసరమైన మరిన్ని పథకాలను తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు చదువుకున్న వారందరికీ ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఏడాదికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు. వైసిపి పాలనలో వేలాది ఎకరాల పేదల భూములను ఆ పార్టీ నాయకులు దోసేసారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ అధ్యక్షుడు కే రమణ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రామస్వామి నాయుడు, టిడిపి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కే నగేష్ కుమార్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కే.లీ లావతి పాల్గొన్నారు.