విశాలాంధ్ర,సీతానగరం: సీతానగరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపిపి బలగ రవనమ్మ అధ్యక్షతన శనివారం జరిగింది. పలుఅంశాలపై రామవరం, చెల్లంనాయుడువలస, కృష్ణ రాయపురం, పాపమ్మవలస, జోగమ్మపేట, ఇప్పలవలస, తామరఖండి సర్పంచులు అధికారులను నిలదీశారు. సర్వసభ్య సమావేశంలో కీలకమైన ఎంపీటీసీలు మాత్రం మౌనంగానే ఉండిపోయారు.ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ బాబ్జి, ఎంపిడిఓ ప్రసాద్, ఈఓపిఆర్డీ వర్మ, ఏఓ అవినాష్, వైద్యులు శిరీష, రాధాకాంత్, పశు వైద్య అధికారి రామారావు, ఐసీడీఎస్ పిఓ సుగుణ, వెలుగు ఏపిఎం శ్రీరాములు, హౌసింగ్ ఏఈ జానకీరాం, ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈఈ పవణ్ కుమార్, పంచాయతీ రాజ్ జేఈ చంద్రమౌళి ,మండల విద్యాశాఖాధికారులు సూరి దేముడు, వెంకటరమణ, ఆర్ ఐ శ్రీనివాసరావు, ఉపాధిహామీపథకం ఏపిఓ భాను వివిద శాఖల అధికారులు,ఎంపీటీసీలు,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.