సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు
విశాలాంధ్ర -విజయనగరం : సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్(70) మృతికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు సంతాపం తెలిపారు. లక్నో యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (LUSU)తో ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారనీ, 1977లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పారు. అంజన్ ఆల్ ఇండియా కిసాన్ సభకు ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారని ఆయన సేవలు అందరికీ ఆదర్శప్రాయమనీ కామేశ్వర రావు తెలిపారు.