అడగడుగున పొలీస్ పహారా..
విశాలాంధ్ర-పార్వతీపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుదవారంనాడు పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలోని కురుపాంలో అమ్మఒడి కార్యక్రమంను ప్రారంభం చేయడానికి వస్తున సంధర్భంగా హెలిప్యాడ్, సభాస్థలి, కాన్వాయ్ వెళ్ళే మార్గం, రోడ్లకు ఇరువైపుల జనాలు కోసం ఏర్పాట్లును కట్టుదిట్టంగా సిద్ధంచేశారు. చినమేరంగి సాంకేతిక కళాశాలవద్ద హెలిప్యాడ్ ను, చినమేరంగి- కురుపాం మధ్యలో రియల్ ఎస్టేట్ వద్ద మీటింగుఏర్పాటుకు సంబందించి అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్దం చేశారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఆమెభర్త,జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజులు గత పది రోజులుగా అహర్నిశలు శ్రమించి విజయవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం గత ఐదురోజులుగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్, జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ గోవిందరావు, పాలకొండ సబ్ కలక్టర్ నూరుల్ మహల్,ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు విష్ణు చరణ్, కల్పన కుమారి , జిల్లా రెవెన్యూ అధికారి వెంకట రావు, అదనపు ఎస్పీ డాక్టరు దిలీప్ కిరణ్,పాలకొండ డి. ఎస్పి కృష్ణారావు, జిల్లా విద్యాశాాఖాధికారి ఎన్ ప్రేమ్ కుమార్,జిల్లా అధికారులంతా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, విద్యాశాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు కూడా అమ్మఒడి కార్యక్రమం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.
మంగళ వారం ఉదయం విశాఖపట్టణం
డిఐజి ఎస్.హరికృష్ణ, ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు సీఎం కాన్యాయ్ ట్రైల్ రన్ ను హెలిప్యాడ్ నుండి సభాస్టలికి, సభాస్థలి నుండి హెలిప్యాడ్ వరకు నిర్వహించారు. మన్యం జిల్లాలోని మన్య ప్రాంతమైన కురుపాంలోసీఎం ప్రోగ్రాం దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు తీసుకోవాల్సిన చర్యలపై డిఐజి, ఎస్పీలు పోలీస్ సిబ్బందికీ తగుఆదేశాలు జారీచేశారు.హెలిప్యాడ్, మీటింగు స్థలం, రోడ్ షో ప్రాంతాల్లో, మన్యం జిల్లాలోని అన్ని ప్రాంతాలకు డాగ్ స్క్వాడ్, స్పెషల్ స్క్వాడ్ తదితర బృందాలు నిరంతరం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సుమారు రెండు వేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం ఏర్పాటుచేశామన్నారు
హెలిప్యాడ్, సభాస్థలి పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు:బుదవారం సీఎం పర్యటన దృష్ట్యా కురుపాం, చినమేరంగి వద్ద హెలిప్యాడ్ సభాస్థలి, రోడ్ మార్గంలో వెళ్ళే ఏర్పాట్లును రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర గిరిజన విద్యాశాఖ మంత్రి పి. రాజన్నదొర, జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నశ్రీను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎమ్మెల్యేలు పాముల పుష్పా శ్రీవాణి,వి కళావతి, ఏ.జోగారావు, ఎమ్మెల్సీపాలవలస, రాష్ట్ర టిడ్కో ఛైర్మన్ జమ్మాన, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ ఎస్ జయమణి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సందర్శన చేశారు. సీఎం పర్యటన విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని, అమ్మ ఒడి కార్యక్రమ లాంచింగ్ తదితర అంశాలపై మంత్రులు బొత్ససత్యనారాయణ, రాజన్నదొరలు తగు ఆదేశాలు జారీ చేశారు.
![](https://visalaandhra.com/wp-content/uploads/2023/06/Untitled-2-copy-570.jpg)