Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

28న ఐఎంఎ నూతన భవనం ప్రారంభం

విశాలాంధ్ర- విజయనగరం : విజయనగరం లో నూతనం గా నిర్మించబడ్డ ఐ ఎం ఎ భవనాన్ని,భారతీయ వైద్యుల సంఘం(ఐ ఎం ఎ) జాతీయ అధ్యక్షుడు డా.అశోకన్ ఈ నెల 28న ప్రారంభిస్తారని ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెసి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో అమలు కావాల్సిన ఆరోగ్య మ్యానిఫెస్టో, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు,ప్రజలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సేవల ప్రాప్తి తదితర అంశాలపై చర్చ జరగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, డాక్టర్ డి.వి. జి. శంకరరావు ను ఐ ఎం ఎ
రాష్ట్ర అధ్యక్షులు డా. జే సీ నాయుడు,ప్రభుత్వ వైద్య కళాశాల ఆచార్యులు డా.అప్పల నాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీవ్ర వేడిమి వాతావరణం నెలకొన్న దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను,ప్రాథమిక చికిత్సలను ఐ ఎం ఎ వైద్యులు వివిధ మాధ్యమాల ద్వారా, నేరుగా విస్తృత ప్రచారం ద్వారా తెలిపే కార్యక్రమాలను నిర్వహించాలనీ చైర్మన్ వారికి సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img