విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని సీతానగరం, బూర్జ, గాదెలవలస, పెదంకలం, నిడగల్లు, లచ్చయ్యపేట తదితర గ్రామాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు సంధర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. మండల కేంద్రంలో జరిగే వేడుకల్లో మండలపార్టీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జి, రాష్ట్ర ఎస్సీ కమీషన్ మెంబర్ ఎస్ జయమణి రామారావు, జే సి ఎస్ కన్వీనర్ యు.సురేష్, ఎంపీటీసీలుగౌరీ కిరణ్ కుమార్, కుసుమ కుమారి సూర్యనారాయణ, కో ఆపరేటివ్ ప్రెసిడెంట్ కూర్మారావు ఉప సర్పంచ్ అరవింద్ వైఎస్సార్సీపీ నాయకులు వెంకన్న, అప్పారావు, పిన్నింటి రామారావు, లంక రాములు తదితర అభిమానులు పాల్గొన్నారు.