విశాలాంధ్ర,సీతానగరం : అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు.గురువారం మండలంలో లచ్చయ్యపేట గ్రామసచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమములో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు .జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు.కులధృవీకరణ,ఆదాయ,జనన, కుటుంబ , మరణ ధృవీకరణ, కొత్త రైస్ కార్డులు, వివాహా ధృవీకరణ పత్రాల మొత్తం 461అందజేశారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంను ప్రజలకు తెలిపారు.
ఈకార్యక్రమంలోజడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టి రాజు, స్థానిక సర్పంచ్ చింతాడ కృష్ణ, ఎంపీటీసీ అక్కపోలు సింహాచలం,ఎంపిడిఓ ప్రసాద్, ఆర్ ఐ శ్రీనివాసరావు, ఎంఈఓ సూరిదేముడు, వెలుగు ఏపిఎం శ్రీరాములు నాయుడు, హౌసింగ్ ఏఈ జానకీరామ్,మండల నాయకులు అంబటి కృష్ణమూర్తి, పోల ఈశ్వర నారాయణ, ఆర్వీ పార్థసారథి,ఎం రామకృష్ణ, మర్రాపు ధనుంజయ, నారాయణరావు, కురమానశ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు బురిడీ సూర్యనారాయణ, స్టేట్ డైరెక్టర్ ఎస్ తిరుపతి రావు, శ్రీకాంత్, సచివాలయం సెక్రటరీ మురళి,ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.