నిత్యం ఇదే సమస్య పట్టించుకోని అధికారులు
విశాలాంధ్ర- రాజాం : రాజాం చీపురుపల్లి రోడ్ లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులతో నిత్యం ట్రాఫిక్ జాం. ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుండి రాత్రి 7:30 వరకు రోజు ట్రాఫిక్ తో నిత్య నరకం అనుభవిస్తున్న ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ప్రజలు… చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు… ఇష్టానుసారంగా రోడ్లకు ఇరువైపులా బస్సులు నిలుపుదలతో రోడ్డు పై ప్రయాణికులకు తీవ్ర అంతరాయం. ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని రోడ్డుపైన వెళ్లేవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి రోడ్డుపైన ఈ ప్రవేటు ట్రావెల్ బస్సులను నిలుపుదల చేయకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటారని స్థానికులు కోరుతున్నారు …