విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : మంగళవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ 16 ట్రైనింగ్ బ్యాచ్ ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ ప్రారంభించారు. విజయనగరం, మన్యం మరియు విశాఖ జిల్లాలకు చెందిన 16 మంది అభ్యర్థులతో ఈ బ్యాచ్ ప్రారంభించారు . 42 రోజులపాటు సాగే ఈ ట్రైనింగ్ నందు చక్కగా డ్రైవింగ్ మెళకువలు నేర్చుకుని ఆ రంగంలో చక్కగా రాణించాలని అభ్యర్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్. జె శ్రీనివాసరావు,ట్రైనర్ డి ఎం రాజు రాజు పాల్గొన్నారు.