టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి….
విశాలాంధ్ర -ఏలూరు: ముందస్తు సమాచారం లేకుండా నిరుపేదల ఇల్లు తొలగించడం హేయమైన చర్య అని టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక పాత బస్టాండ్,34వ డివిజన్ వద్దగల డి ఎం హెచ్ ఒ కార్యాలయం వెనుక సుమారు 50 సంవత్సరాల నుండి పేదలు నివాసం ఉంటున్న ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శనివారం ఉదయం నుండి తొలగిస్తు, తొలగింపు సమాచారాన్ని బయటకు తెలియకుండా
జేసిబి లతో ఇళ్లను కులుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తన బృందంతో బాధిత ప్రాంతానికి వెళ్లడంతో మున్సిపల్ అధికారులు పలాయనం చిత్తగించారు.
స్థానిక కార్పొరేటర్, మేయర్ , స్థానిక శాసనసభ్యులు
కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేరని బాధితులు వాపోయారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఆహారం, మంచినీరు వసతి కల్పించామని బడేటి చంటి తెలియజేశారు.బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని బడేటి చంటి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఎంసి మాజీ చైర్మన్ పూజా నిరంజన్ మాజీ కార్పొరేట్ మారం అను ,బోరోతు బాలాజీ ,మాజీ విప్ గూడవల్లి వాసు, తదితరులు పాల్గొన్నారు.