న్యూదిల్లీ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఆగస్టు 1న పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.73.5కు పెంచాయి. 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరలలో ఎటు వంటి మార్పులేదు. ఆదివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. తాజా ధరల పెరుగుదలతో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢల్లీిలో రూ.1623.00గా ఉంది. అలాగే, వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579. 50కు పెరిగింది. కోల్కతా, చెన్నైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.1629.00, రూ.1761.00గా ఉన్నాయి. చమురు, గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. అయితే దేశీయ గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఈ ఆగస్టులో మార్పులు చేయలేదు. గత నెల జులై 1న ధరలను రూ.25.50 పెంచారు. జులైలో ధరల పెరుగుదలతో 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు దిల్లీలో రూ.834.50, ముంబైలో రూ.834.50, కోల్ కతాలో రూ.861, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్లో రూ.887 లుగా ఉంది. 2021లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 పెంచారు. జనవరి 1, 2021న 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉంది.