విశాలాంధ్ర,సీతానగరం: ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా ప్రారంభం చేస్తున జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎంపిడిఓ ప్రసాద్,తహశీల్దార్ ఎన్వీ రమణలు పిలుపు నిచ్చారు.బుధవారం స్థానిక మండల పరిషత్తు సమావేశమందిరంలోజగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, గ్రామరెవెన్యూ అధికారులు, సచివాలయాల వెల్ఫేర్, డిజిటల్ సహాయకులకు శిక్షాణాకార్యక్రమంను నిర్వహించారు. జిల్లాలో 24నుండి నిర్వహించనున్న జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు వీలైనంత ఎక్కువ సర్వీసులు అందించాలన్నారు. సచివాలయంసిబ్బంది, వాలంటీర్లు ప్రతీ ఇంటికితిరిగి వారిసమస్యలను తెలుసుకోవాలని, సమస్యలను సంబంధిత పోర్టలునందు నమోదు చేయాలని, వాటిపై విచారణ నిర్వహించి, గ్రామంలో పర్యటించే మండలటీం ద్వారా సదరుసమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఈకార్యక్రమంలోనే ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ దృవపత్రాలు, జనన, మరణ దృవపత్రాలు, ఫ్యామిటీ మెంబరు సర్టిఫికెట్స్, వివాహ సర్టఫికెట్స్, మ్యుటేషన్లు తదితర సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్టిఫికెట్స్ జారీ, మ్యుటేషన్లు చేయునపుడు నిబంధనలు పాటించాలని తెలిపారు.మండలములో రెండు మండలటీంలను ఉంటాయని చెప్పారు. ఒకటీం తహశీల్దారు ఆద్వర్యంలో ఉంటుందని,మరొక టీం ఎంపిడిఒ ఆద్వర్యంలో ఉంటుందని,లబ్ధిదారులకు ఇచ్చే దృవీకరణ పత్రాల జారీలో కమిటీలు విచారణ అనంతరం మండల టీంచే సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పారు.